Wednesday, May 1, 2024

కాంగ్రెస్ వస్తే ఫ్రీ కరెంట్ రద్దు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రైతులు తెల్చుకోవాలి
కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్తు రద్దే-
రైతన్నలకు మూడు గంటల విద్యుత్ చాలన్న
కాంగ్రెస్ విధానంపైన ప్రతి గ్రామంలో చర్చ జరగాలి
ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి –
ఈ నెల17 నుంచి పది రోజులపాటు
రైతు వేదికల వద్ద రైతు సమావేశాలు
కాంగ్రెస్ కరెంటు కుట్రలపై ప్రతి గ్రామంలో చర్చ
ప్రతి రైతు వేదికల వద్ద రైతు సమావేశాలు
మూడు పంటలు బిఆర్‌ఎస్ నినాదం-
మూడు గంటల కరెంటు కాంగ్రెస్ విధానం
పేరిట బిఆర్‌ఎస్ సమావేశాలు
ఎకరానికి గంట విద్యుత్తు చాలన్న కాంగ్రెస్ నేతల
మాటలు రైతులను అవమానించడమే
రైతులను అవమానించిన కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పేలా తీర్మానాలు
24 గంటల ఉచిత విద్యుత్తు వద్దన్న రైతు వ్యతిరేక
కాంగ్రెస్ కుట్రను రైతాంగానికి వివరించాలి
పార్టీ శ్రేణులకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్
ప్రెసిడెంట్ కెటిఆర్ దిశానిర్ధేశం
బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కెటిఆర్ టెలి కాన్ఫరెన్స్
హైదరాబాద్ : రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నదని భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు అన్నారు. రాష్ట్రంలో ఉన్న 95 శాతం మంది రైతన్నలకు మూడు గంటల విద్యుత్ సరఫరా చాలు అంటూ ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని బిఅర్‌ఎస్ పార్టీ శ్రేణులను మంత్రి కెటిఆర్ కోరారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్తు రద్దు చేస్తుందన్న మాటను ప్రజాబాహుళ్యంలోకి మరింతగా తీసుకువెళ్లేందుకు, బిఆర్‌ఎస్ పార్టీ మూడు పంటలు కావాలా…కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు కావాలా అన్న నినాదంతో కదం తొక్కాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.ఈ మేరకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ శనివారం పార్టీ శ్రేణులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న తెలంగాణ రైతన్న బతుకులో చీకట్లు నింపే కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు చాలు అన్న వాదన ప్రతి గ్రామంలో, ప్రతి రైతు ఇంట్లో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని కెటిఆర్ పేర్కొన్నారు. ఒకవైపు రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతన్నల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకువచ్చేందుకు రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటు వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఎంతగానో పాటుపడుతుందని తెలిపారు. రైతుల పట్ల, వ్యవసాయ రంగం పట్ల తమకున్న గుడ్డి వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తు అనుచితమంటు మాట్లాడిందని మండిపడ్డారు. 2001లో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు వ్యాఖ్యలను ప్రస్తావించిన కెటిఆర్.. ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడే అని చెప్పారు. అందుకే చంద్రబాబు రైతు, వ్యవసాయ వ్యతిరేక ఆలోచన విధానంతోనే ఉచిత విద్యుత్తుపైన అడ్డగోలుగా మాట్లాడారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలుగు కాంగ్రెస్, చంద్రబాబు కాంగ్రెస్ అన్న విషయాన్ని ప్రజలకు తెలియచెప్పాలని అన్నారు.
17వ తేదీ నుంచి రైతు వేదికల వద్ద రైతు సమావేశాలు
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచిత విద్యుత్తు వద్దు… కేవలం మూడు గంటల విద్యుత్ చాలు అంటూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని, అందుకే తెలంగాణ రైతన్నలు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌కి వ్యతిరేఖంగా స్పందించారని కెటిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్తు రద్దు అవుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియచెప్పేలా ఈ నెల 17వ తేదీ నుంచి పది రోజులపాటు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల వద్ద రైతు సమావేశాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కెటిఆర్ సూచించారు. ప్రతి రైతు వేదిక వద్ద కనీసం 1000 మంది రైతులకు తగ్గకుండా ఈ సమావేశాన్ని నిర్వహించాలని, ఈ సమావేశ నిర్వహణ బాధ్యతను స్వయంగా పార్టీ ఎంఎల్‌ఎలు తీసుకోవాలని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేయాలని అన్నారు. ఒక ఎకరానికి ఒక గంట విద్యుత్ సరిపోతుందంటూ, 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతాంగాన్ని అవమానించడమే అని పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ వెంటనే తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ రైతు సమావేశాల్లో తీర్మానం చేయాలన్నారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పాలనలో ఉన్న కరెంటు కష్టాలను భారత రాష్ట్ర సమితి పాలనలో అందుతున్న కరెంటు పరిస్థితులను రైతులకు వివరించాలని కెటిఆర్ పార్టీ శ్రేణులను కోరారు. కటిక చీకట్ల కాంగ్రెస్ పార్టీ కావాలా, రైతు జీవితాల్లో కరెంటు వెలుగులు నింపిన బిఆర్‌ఎస్ కావాలా తెలుసుకోవాలని రైతులను కోరాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News