Monday, April 29, 2024

రైతుల దాతృత్వం.. సిఎం సహాయ నిధికి విరాళం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:కరోనా నివారణకు సిఎం కెసిఆర్ చేస్తున్న కృషికి తమవంతు ప్రయత్నంగా విరాళాలు అందించాలని తెలంగాణ లక్కమారి కాపు సంక్షేమ సంఘం నిర్ణయించింది. గురువారం సిఎం సహాయ నిధికి రూ.3,45,197 విరాళాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర పంచాయతీరాజ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి హైదరాబాద్‌లో అందజేశారు. లక్కమారి కాపు సంక్షేమ సంఘంలోని 42వేల మంది రైతులు తలా కొంత డబ్బులు పోగు చేసి ఈ మొత్తాన్ని సిద్ధం చేశారు. దీంతో ఆ సంఘాన్ని, రైతులను మంత్రి ఎర్రబెల్లి అభినందించారు. కరోనా వైరస్ పర్యవసానంగా ఆర్థిక వ్యవస్థతో పాటు, ప్రజలు తీవ్రంగా నష్టపోయారని మంత్రి పేర్కొన్నారు. దాతలు తమ దాతృత్వాన్ని చాటుకోవడానికి ఇదే సరైన సమయమని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్కమారి కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షుడు, పాలకుర్తి ఎంపిపి నల్ల నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అనుముల నర్సయ్య, గౌరవాధ్యక్షుడు మంద రాజమల్లు, పాలకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, కడుదుల కరుణాకర్ రెడ్డి, ఆ సంఘం యువజన విభాగం, ఇతర విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News