Friday, April 26, 2024

లక్షద్వీప్‌ను నాశనం చేస్తున్నారు

- Advertisement -
- Advertisement -

Lakshadweep is being destroyed:Rahul Gandhi

పాలకులపై రాహుల్ ఆగ్రహం

న్యూఢిల్లీ: తమ సంస్కృతిని కాపాడుకునేందుకు లక్షద్వీప్ ప్రజలు సాగిస్తున్న పోరాటానికి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించారు. అధికారంలో ఉన్న అజ్ఞాన పాలకులు లక్షద్వీప్‌ను నాశనం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
లక్షద్వీప్‌లో శాంతి, సంస్కృతిని నాశనం చేయడంతోపాటు నియంతృత్వ ఆంక్షలను విధించి అక్కడి ప్రజలను వేధిస్తున్న లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్‌ను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ మంగళవారం డిమాండు చేసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ బుధవారం ట్వీట్ ద్వారా లక్షద్వీప్ ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. భారతదేశానికి సముద్రంలో ఆభరణం లాంటి లక్షద్వీప్‌ను అధికారంలో ఉన్న అజ్ఞాన పెద్దలు నాశనం చేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. లక్షద్వీప్ ప్రజలకు తాను అండగా ఉంటానని ఆయన ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News