Saturday, May 4, 2024

ములాయంతో లాలూ భేటీ

- Advertisement -
- Advertisement -

Lalu Prasad, Mulayam Singh meet in Delhi

సీనియర్ సోషలిస్ట్‌ను పరామర్శించానంటూ లాలూ ట్విట్

న్యూఢిల్లీ: ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్‌యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పి) వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌యాదవ్ భేటీ అయ్యారు. సోమవారం ఢిల్లీలో వీరిద్దరూ సమావేశమైనట్టు ఇరు పార్టీలవర్గాలు తెలిపాయి. వీరిద్దరి మధ్యా సమావేశంలో ములాయం కుమారుడు, ఎస్‌పి అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ కూడా పాల్గొన్నారు. సమావేశానికి సంబంధించిన ఫోటోలను లాలూతోపాటు అఖిలేశ్ ట్విట్ చేశారు. దేశంలోని సీనియర్ సోషలిస్ట్ నేతతో తాను భేటీ అయ్యానంటూ లాలూ ట్విట్ చేశారు. ములాయం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశానన్నారు. రైతులు, అసమానత్వం, నిరుద్యోగంలాంటి సమస్యలపై తామిద్దరం ఉమ్మడిగా పోరాడామని లాలూ గుర్తు చేశారు. ప్రస్తుతం దేశానికి మతోన్మాదం, పెట్టుబడిదారీ విధానం అవసరం లేదని, సమానత్వం, సామ్యవాదం కావాలని లాలూ ట్విట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News