- Advertisement -
హైదరాబాద్: నగరంలోని లంగర్హౌస్ లో శుక్రవారం అర్థరాత్రి జరిగిన డబుల్ మర్డర్ కేసును వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కేవలం 4 గంటల్లోనే ఛేదించారు. ఆదిపత్య పోరులో భాగంగానే చాంద్ మహ్మద్, అబులను మరో రౌడీ షీటర్ హర్షద్ దారుణంగా హత్య చేశాడు. ఈ జంట హత్యల కేసులో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు కోసం గాలిస్తున్నారు. నిన్న నాలుగు హత్యలు జరగడం హైదరాబాద్లో కలకలం రేపింది. పాత కక్షల నేపథ్యంలో ఈ జంట హత్యలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
Langar Houz double murder case solved by police
- Advertisement -