Saturday, April 27, 2024

కరోనాతో ఫేమస్ సింగర్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

 

 corona virus
న్యూయార్క్: ప్రపంచంలో అగ్రదేశమైన అమెరికాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. అమెరికాలో ఫేమస్ సింగర్ జో డిప్ఫే కరోనా వ్యాధితో మృత్యువాతపడ్డాడు. చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడి చనిపోయారు. ఒక్లమాకు చెందిన 61 ఏళ్ల డిప్ఫే ‘పిక్ ఆఫ్ మ్యాన్, ఇఫ్ ది డెవిల్ డాన్స్‌డే, హాంకీ టాంక్ యాటిట్యూడ్’ వంటి ఆల్బమ్‌లు రూపొందించి మంచి పేరు ప్రఖ్యాతాలు తెచ్చుకున్నాడు. 1990లో ఆయన తయారు చేసి తొలి అల్బమ్ ‘ఏ థౌజండ్ వైండింగ్ రోడ్స్’ ఘన విజయం సాధించింది. ప్రపంచంలో అమెరికాలో అత్యధికంగా 1,42,735 మంది కరోనా సోకగా 2489 మంది మృతి చెందారు. ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 7,23,732 మందికి సోకగా 34000 మంది మృత్యువాతపడ్డారు. ఇటలీలో కరోనాతో 10,779 మంది చనిపోగా 97,689 మందికి సోకింది. కరోనా వైరస్ వరస క్రమంలో చైనా మూడో స్థానంలో ఉంది. చైనాలో 81,470 మందికి కరోనా వైరస్ సోకగా 3304 మంది మరణించారు. ఇండియాలో కరోనా వైరస్ 1190 మందికి సోకగా 29 మంది బలయ్యారు.

Legendary Singer Joe Diffie Died with corona virus, I just want to say to all the fans, the show cancellations are not my idea of a good time
Legendary Singer Joe Diffie Died with corona virus
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News