- Advertisement -
అమరావతి: తిరుపతి నగరంలో చిరుతపులుల కలకలం రేగింది. రెండు వేర్వేరుప్రాంతాల్లో చిరుతపులులు సంచారం చేస్తున్నాయి. జీవకోనలో ఈశ్వరుడి గుడి ప్రాంతాంలో ఓ చిరుత కుక్కను గాయపర్చింది. జూపార్క్ రోడ్ లో వెళ్తున్న బైక్ లపై మరో చిరుత దాడి చేసింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు చిరుతను పట్టుకునేందుకు ప్రయంత్నిస్తున్నారు. బైక్ లపై ప్రయాణిస్తున్న వారిని వెంబడించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చిరుత దాడిలో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. చిరుతపులి జూ పార్క్ నుంచి తప్పించుకుని వచ్చింది కాదని తెలుస్తోంది.
leopard has created hulchul at road of Tirumala
- Advertisement -