- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 23,841మందికి పరీక్షలు నిర్వహించగా 1724 కొత్త కోవిడ్-19 కేసులు, 10 మరణాలు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97,424కి చేరింది. ఈ వైరస్ తో ఇప్పటివరకు 729మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 21,509 యాక్టివ్ కేసులుండగా…75,186 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం కరోనా నుంచి కోలుకుని 1,195మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8లక్షల 21,311 మందికి టెస్టులు చేసినట్టు రాష్ట్ర వైద్యశాఖ ప్రకటించింది. కొత్త కేసుల్లో హైదరాబాద్ లో 395, రంగారెడ్డిలో 165, మేడ్చల్ లో 105 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
1724 new covid 19 cases reported in telangana
- Advertisement -