Wednesday, May 8, 2024

ఎసిబి వలకు చిక్కిన గిర్దావర్

- Advertisement -
- Advertisement -

bribe

మనతెలంగాణ/కామారెడ్డి: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో పని చేస్తున్న గిర్దావర్ సుభాష్ బుధవారం ఓ రైతు నుండి రూ.3వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మండలంలోని కొర్పోల్ గ్రామానికి చెందిన బషిరోద్దిన్ అలియాస్ సలీం కొన్న భూమిని మ్యూటేషన్ చేయడానికి రూ.4,500 లంచం డిమాండ్ చేయడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఎసిబి డిఎస్ పి రవికుమార్ తన సిబ్బందితో తహసీల్దార్ కార్యాలయంలో రైతు నుండి గిర్దావర్ డబ్బులు తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు. రూ.3 వేలు నగదును స్వాధీనం చేసుకొని గిర్ధావర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లంచాలు అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని డిఎస్పీ రవికుమార్ తెలిపారు.

Lingampet Revenue Officer Trap in ACB net

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News