- Advertisement -
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న లారీ డ్రైవర్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు అక్కడి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సిసి కెమెరాల ఆధారంగా వాహనాన్ని గుర్తిస్తామని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -