Saturday, April 27, 2024

తిరుపతితో ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎపిలోని తిరుపతిలో మంగళవారం చోటుచేసుకుంది. గోవిందరాజస్వామి ఆలయం ఉత్తర మాడవీధిలోని ఓ లాడ్జిలో సోమవారం ఉదయం ఏడు గంటలకు దిగిన వీరిద్దరూ ఇవాళ ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. యువతికి ఇటీవలే వేరే యువకుడితో వివాహం కాగా, ప్రేమ వ్యవహారంలో వీరిద్దరూ ఇలా చేసినట్లు తెలుస్తోంది. యువతి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన అనూషాగా గుర్తించగా.. యువకుడు హైదరాబాద్ చెందిన కృష్ణారావుగా గుర్తించారు. లాడ్జి సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News