Friday, April 26, 2024

మహిళపై గ్యాంగ్ రేప్… ప్రియుడు ఆత్మహత్య…

- Advertisement -
- Advertisement -

Dead Body
హైదరాబాద్: వివాహేతర సంబంధం బయటపెడుతామని చెప్పి ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడంతో ఆమె తన ప్రియుడితో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియుడి మృతి చెందగా ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ వివాహిత తన భర్తతో కలిసి బోరబండలో నివసిస్తోంది. భర్తతో పాటు భవన నిర్మాణ కూలీ పనికి వెళ్లినప్పుడు వెంకట్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. పరిచయం వివాహతేర సంబంధానికి దారి తీసింది. ఆమె ఇంట్లోకి వెళ్లి వెంకట్ బయటకు వచ్చినప్పుడు ఇరుగుపొరుగున ఉండే ఇస్మాయిల్, ఓ బాలుడు గమనించాడు.

వెంటనే ఆమెను బెదిరించి అత్యాచారం చేయడంతో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. దీంతో వెంకట్ కూడా ఆమెను బైక్‌పై వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ అటవీ సమీపంలోకి తీసుకెళ్లి పాయిజన్ తాగారు. తన తమ్ముడికి వెంకట్ ఫోన్ చేయడంతో ఈ విషయం చెప్పాడు. వెంటనే పోలీసులకు అతడు తెలియజేయడంతో పోలీసులు అక్కడి చేరుకొని ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. వెంకట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా ఆమె కోలుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News