Friday, May 3, 2024

కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

6 Killed in Road Accident in Kamareddy

కామారెడ్డి: జిల్లాలోని బిచ్కుంద మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం మండలంలోని జగన్నాథపల్లి గేట్ వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ఓ కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్నపోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. బిచ్కుంద నుంచి పిట్లం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మృతిచెందిన వారిని హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు తెలిపారు.

6 Killed in Road Accident in Kamareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News