Monday, April 29, 2024

రామానంద ఆశ్రమంలో దారుణం.. ఆహారం లేక 17 గోవులు మృతి

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: రామానందస్వామి ఆశ్రమంలో దారుణం సంఘటన చోటుచేసుకుంది. ఆశ్రమంలో నీరు, ఆహారం లేక గోవులు మృత్యువాత పడుతున్నాయి. ఆశ్రమ నిర్వాహకులు అందుబాటులో లేకపోవడంతో ఆశ్రమంలో ఉన్న దాదాపు 160 గోవులు ఆకలితో అల్లాడుతున్నాయి. నిన్న(శుక్రవారం) దాణా లేక 13 గోవులు మృతి చెందగా.. శనివారం నాలుగు గోవులు మరణించాయి. గోవుల మరణాలపై ఎపి మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. గోశాలకు వెళ్లి గోవుల పరిస్థితిని మంత్రి సమీక్షించారు. గోవులకు దాణా, నీరు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గోవుల దాణా కోసం రూ.10వేలు అందజేశారు. సొంత నిధులతో గోవుల అవసరాలను తీరుస్తామని ఎమ్మెల్సీ వంశీకృష్ణ హామీ ఇచ్చారు.

17 Cows died in Ramananda Ashramam in Visakhapatnam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News