Sunday, May 5, 2024

వివాహేతర సంబంధం…. జంట ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Lovers commit suicide in Andhra Pradesh

అమరావతి: వివాహేతర సంబంధం మానుకోవాలని ఓ జంటను మందలించినందుకు వారు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో జరిగింది. ప్రస్తుతం ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉప్పర్‌పల్లి గ్రామంలో గురుమూర్తికి మూడేళ్ల క్రితం జయలక్ష్మితో వివాహం జరిగింది. ఈ దంపతులకు బాబు కూడా ఉన్నాడు. చిన్నకుంట గ్రామానికి చెందిన సాయిలీలతో గుర్తుమూర్తికి ఓ దాబాలో పరిచయం ఏర్పడింది. వీళ్ల పరిచయం ప్రేమగా మారడంతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. వివాహేతర సంబంధం ఇరు కుటుంబాలకు తెలియడంతో వారికి వద్దని జంటను మందలించారు. మనస్థాపం చెందిన జంట ఆదివారం సాయంత్రం వనమిత్ర శివారులోకి చేరుకొని క్రిమి సంహారక మందు తాగారు. గురుమూర్తి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని బైక్‌పై అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికులు ఆమెను 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News