Monday, April 29, 2024

మొయినాబాద్ లో రోడ్డు ప్రమాదం… చికిత్స పొందుతూ మరో యువతి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శనివారం మొయినాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సౌమ్య చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున దుర్మరణం చెందింది. సందీప్ రెడ్డి అనే వ్యక్తి మద్యం పూటుగా సేవించి కారును ద్విచక్రవాహనానికి ఢీకొట్టడంతో  ప్రేమిక (16) ఘటన స్థలంలోనే మృతి చెందడంతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయలపాలైన సౌమ్యకు గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తుండగా చనిపోయింది. మరో అమ్మాయి అక్షర పరిస్థితి కూడా విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాదానికి కారకుడైన సందీప్ రెడ్డి మద్యం సేవించి కారు నడిపినట్లు పోలీసులు వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా 228 శాతం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సందీప్ రెడ్డి ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News