Friday, May 3, 2024

పెళ్లి….. కాలువలో దూకి ప్రేమజంట ఆత్మహత్య….

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కాలువలో దూకి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మెటేగళ్లి  లేఔట్ చెందిన నవీన్ (20), నిసర్గ (19) యువతి యువకుడు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు బంధువుల కావడంతో ప్రేమ విషయం పెద్దలకు తెలియకుండా గుట్టుగా ఉంచారు. నిసర్గ తల్లిదండ్రులు ఆమె పెళ్లి మరో యువకుడితో చేశారు. డిసెంబర్ 1న యువతి నవీన్ ని కలిసింది. వెంటనే ఇద్దరు కలిసి బైక్ పై బయటకు వెళ్లారు. కెఆర్ఎస్ కాలువ వద్దకు వెళ్లి ఇద్దరు కలిసి చున్నీని నడుము కట్టుకొని కాలువలో దూకారు. రెండు రోజుల నుంచి బైక్ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువతి, యువకుడు తిరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతంలో కాలువలో గాలించగా శుక్రవారం రెండు మృతదేహాలు బయటపడ్డాయి. వెంటనే వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News