Friday, May 3, 2024

‘మా’ ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలి: మంచు విష్ణు

- Advertisement -
- Advertisement -

MAA elections should be conducted by ballot

హైదరాబాద్: అక్టోబర్ 10న జరిగే ‘మా’ ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని నటుడు మంచు విష్ణు డిమాండ్ చేశారు. పేపర్ బ్యాలెట్ అయితే ఎన్ని సార్లు అయినా చెక్ చేసుకోవచ్చన్నారు. మా ఎన్నికల అధికారికి మంచు విష్టు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మా కుటుంబ సభ్యులు ఓట్లు అడిగితే తప్పేంటని ప్రశ్నించారు. తమ ప్యానెల్ లో ఉన్న గిరిబాబును ఓటు వేయమని ఎలా? అడుగుతారని చురకలంటించారు. ప్రకాశ్ రాజు తెలుగు వ్యక్తి కాదు అన్నారు. మా ఎన్నికలలో తన కుటుంబ సభ్యులను లాగొద్దని ప్రకాశ్ రాజును హెచ్చరించారు. గతంలో జీవిత ఓట్లు అడగలేదా ? అని నిలదీశారు. మా డాడీ ఓట్లు వేయమని జీవితను అడిగితే తప్పేముందన్నారు. విష్ణు, ప్రకాశ్ రాజు మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News