Friday, April 26, 2024

యాక్షన్ అవతార్‌లో సిద్దార్థ్, శర్వానంద్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యంగ్ హీరో శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో ‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహా సముద్రం’. ఈనెల 23న ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. ఇక ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో సిద్దార్థ్, శర్వానంద్ ఇద్దరూ యాక్షన్ అవతార్‌లో కనిపిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లకు ఇద్దరు హీరోలు రెడీగా ఉన్నట్టు పోస్టర్‌ను చూస్తే అర్థమవుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ మూవీ రాబోతోంది. ఇంటెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

Maha Samudram movie trailer to release on Oct 14

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News