Saturday, April 27, 2024

టిఎంసి పిపి సారధిగా మమత

- Advertisement -
- Advertisement -

Mamata Banerjee elected chairperson of TMC in Parliament

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) పార్లమెంటరీ పార్టీ ఛెయిర్‌పర్సన్‌గా పార్టీ అధినేత్రి మమత బెనర్జీ ఎన్నికయ్యారు. పార్టీ ఎంపీలు ఏకగ్రీవంగా మమతను ఈ స్థానానికి ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం రాజ్యసభ సభ్యులు, టిఎంసి నేత డెరెక్ ఒ బ్రెయిన్ విలేకరుల సమావేశంలో తెలిపారు. తమ నాయకురాలు టిఎంసి పార్లమెంటరీ పార్టీకి చాలా కాలంగా ప్రేరక, అంతకు మించి మార్గదర్శక శక్తిగా ఉన్నారని డెరెక్ చెప్పారు. ఆమె ఏడుసార్లు ఎంపి అయిన తిరుగులేని నేత అని, అనుభవజ్ఞురాలు, దూరదృష్టిగల వారని , అన్ని విధాలుగా తమను నడిపిస్తున్నారని ప్రశంసించారు. సిఎం మమత బెనర్జీ ఇప్పుడు పార్లమెంట్ సభ్యురాలుగా లేరు. అయినప్పటికీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపిలు ఆమెను ఎంచుకున్నారు. ఆమె ఎప్పుడూ తమకు ఫోన్‌లో అందుబాటులో ఉంటారని, పార్లమెంట్‌లో తమ వైఖరిని స్పష్టం చేస్తుంటారని ఎంపిలు తెలిపారు.

Mamata Banerjee elected chairperson of TMC in Parliament

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News