Friday, April 26, 2024

అన్న మందలించాడని తమ్ముడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Suicide

జూలూరుపాడు: అన్న మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని బొజ్జతండాలో చోటుచేసుకుంది. బొజ్జతండాకు చెందిన గుగులోతు శివ (13) తన అన్న చెప్పులు వేసుకున్నాడు. దీంతో అన్నదమ్ముళ్ల మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన శివ పురుగు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.

వెంటనే శివను కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ శివ మృతిచెంఆడు. అప్పటికే సమయం మించిపోవడంతో మృతదేహాన్ని మార్చురిలో భద్రపరిచారు. శుక్రవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించేందుకు మార్చురి గది తలుపులు తెరవగా శివ మృతదేహం కనిపించకపోవడంతో వైద్యులు ఖంగుతిన్నారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గ్రామానికి వెళ్లిన పోలీసులు కుటుంబ సభ్యులు శివ మృతదేహాన్ని మార్చురీ నుంచి ఇంటికి తరలించి అంత్యక్రియలు నిర్వహించినట్లు నిర్ధారించుకున్నారు.

ఈ విషయంపై స్థానిక పోలీసులు తమ ఉన్నతాధికారులకు సమాచారమందించారు. అక్కడకు చేరుకున్న తహసీల్దార్ విజయ్‌కుమార్, కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాల వైద్యులు, స్థానిక ఎస్‌ఐ శ్రీకాంత్ సమక్షంలో పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు . కొత్తగూడెం మార్చురీ నుంచి శివ మృతదేహాన్ని తరలించడానికి సహకరించిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు. వీఆర్‌ఓ రవీందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News