Friday, April 26, 2024

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

Man dead over fell from moving train

 

మన తెలంగాణ/కేసముద్రం: గమనంలో ఉన్న రైలులో నుండి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్‌లో మంగళవారం చోటు చేసుకుంది. వరంగల్ జిఆర్‌పి ఎస్సై ఐలయ్య తెలిపిన వివరాల ప్రకారం…. మహబూబాబాద్ పట్టణానికి చెందిన గెల్లా శ్రీనివాస్ (43) తన భార్య మాధవితో కలిసి వరంగల్‌కు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం ఉదయం బయలుదేరారు. తాళ్లపూసపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు నుండి జారిపడటంతో తీవ్రగాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలియజేశారు. మృతునికి భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలున్నారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News