Friday, May 3, 2024

చద్ది టిఫిన్ పెట్టినందుకు కోడలిని కాల్చిచంపిన మామ

- Advertisement -
- Advertisement -

Gun

 

ఫరీద్‌కోట్: చద్ది టిఫిన్ పెట్టినందుకు ఒక మామ తన కోడలినే తుపాకీతో కాల్చిచంపివేశాడు. ఈ దారుణ సంఘటన పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో గురువారం ఉదయం జరిగింది. భారత వైమానిక దళం నుంచి రిటైర్ అయిన షామ్ లాల్ గురువారం ఉదయం అల్పాహారం తేవడంలో ఆలస్యమైనందుకు తన కోడలిపై మండిపడ్డాడు. ఇంటి పనిలో బిజీగా ఉన్న ఆమె ముందు రోజు రాత్రి మిగిలిన టిఫిన్ తెచ్చి ఇచ్చింది. దీంతో కోపంతో రగిలిపోయిన షామ్ లాల్ తన లైసెన్స్‌డ్ . 12 బోర్ రివాల్వర్‌తో తన కోడలు నీలమ్ కుమారిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను పొరుగువారు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించింది. ఈ సంఘటన తర్వాత షామ్ లాల్ పరారయ్యాడు. నీలమ్ కుమారి భర్త ఇటీవల జరిగిన ఒక ఘర్షణలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. వారికి ఒక యుక్త వయస్కుడైన కుమారుడు ఉన్నాడు.

 

Man Guns down daughter-in-law, Sham Lal guns down his daughter in law for serving him cold breakfast
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News