Sunday, May 5, 2024

నడిరోడ్డుపై పట్టపగలు భార్యను కత్తితో పొడిచి…..

- Advertisement -
- Advertisement -

Man kills wife publicly in Gujarat

గాంధీనగర్: నడిరోడ్డుపై జనాలు చూస్తుండగానే భార్యను భర్త కత్తితో పొడిచి చంపిన సంఘటన గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్ సిటీ కలావాడ్ రోడ్డులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నీతా దాభి(45), ప్రఫూల్ దాభి(50) అనే దంపతులు థావారియా అనే గ్రామంలో నివసిస్తున్నారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త పలుమార్లు ఆమెపై దాడి చేశాడు. దంపతుల మధ్య గొడవ జరగడంతో 15 రోజుల క్రితం తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. నీతా దాభి ఓ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తుంది. స్కూల్‌లో సమావేశం ఉండడంతో మహాప్రభుజిని చౌరస్తాలో పాఠశాల బస్సు కోసం రోడ్డుపై  తన సహోద్యోగులతో కలిసి ఎదురుచూస్తుంది. ప్రఫూల్ దాభి కారులో వచ్చి కత్తితో ఆమె మెడపైన పొడిచాడు. అనంతరం చేతులు, ముఖం పొడవడంతో మరో టీచర్ రేష్మీబెన్ ప్రఫూల్ ఆపడానికి ప్రయత్నించి చేతులకు ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్‌లో నీతాను స్థానిక జిజి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నీతా చనిపోయిందని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. జామ్‌నగర్ పోలీస్ స్టేషన్ అధికారి మహావీర్ కుమార్ జాలు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని అతడికి కరోనా నిర్థారణ పరీక్షలు చేసిన అనంతరం రిమాండ్ తరలిస్తామని పోలీసులు వెల్లడించారు. తన భార్యకు మరో యువకుడితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో హత్య చేశానని నిందితుడు వెల్లడించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News