Tuesday, April 30, 2024

పెళ్లికి నిరాకరించిందని.. రైలు కిందకు తోసేందుకు యత్నం

- Advertisement -
- Advertisement -

Man pushes woman in front of moving train in Mumbai

ముంబై: పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఓ యువకుడు, యువతిని రైలు కిందకు నెట్టెందుకు ప్రయత్నించిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబై ఖార్ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకోగా, యువతి గాయాలయ్యాయి. ఈ సంఘటన మొత్తం స్టేషన్‌లోని సిసిటివి కెమెరాలో రికార్డ్ అయింది. వడాలాలో నివసించే సుమేద్ జాదవ్‌, యువతి గతంలో ఒకే దగ్గర పనిచేశారు. ఆ సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. అయితే జాదవ్ తాగుడుకూ బానిసైయ్యాడని తెలుసుకున్న యువతి అతడిని దూరం పెట్టింది. అప్పటినుంచి అతను యువతిని పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టాడు. శుక్రవారం యువతి అంధేరిలో రైలు ఎక్కగా, జాదవ్ ఆమె ను వెంబడించాడు.

దీంతో యువతి తన తల్లికి ఫోన్ చేయగా ఆమె ఖార్ రైల్వే స్టేషన్ కు వచ్చి యువతిని కలిసింది. మరోసారి యువతి వివాహనికి నిరాకరించడంతో ఆగ్రహించిన యువకుడు లోకల్ రైలు వచ్చే సమయంలో ఆమెను కిందకు తోసే ప్రయత్నం చేశాడు. యువతి, ఆమె తల్లి తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలో యువతి తలకు గాయమైంది. వెంటనే జాదవ్ అక్కడి నుంచి పారిపోయాడు. యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా తలకు 12 కుట్లు పడ్డాయి. యువతి నిర్మల్ నగర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదును చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 12 గంటల్లోనే ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ సంఘటన తర్వాత నిందితుడు తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపపై ఐపిసి లోని సెక్షన్ 307 కింద అతనిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News