Sunday, April 28, 2024

బాలికపై అత్యాచారం కేసులో దోషికి 20ఏళ్ల జైలుశిక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష, రూ.25,000 జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలీంనగర్, అంబేద్కర్ నగర్‌కు చెందిన ఏనెగంటి చెన్నయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. నిందితుడిది నాగర్‌కర్నూలు జిల్లా, మర్రిపల్లి గ్రామానికి చెందిన వాడు. స్థానికంగా ఉంటున్న బాలికపై గత ఏడాది బాలికపై అత్యాచారం చేశాడు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డిఐ ఎండి హఫీజుద్దిన్, ఎస్సై రవిరాజ్ కేసు దర్యాప్తు చేశారు.

Man sentenced to 20 years in prison for raping girl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News