Wednesday, May 1, 2024

ప్రకృతే ఈ సినిమా చేయమని చెబుతోందనిపించింది

- Advertisement -
- Advertisement -

విష్ణు మంచు హీరోగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మంచు విష్ణు మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

అలా సినిమా ప్రారంభం…
కథపై నమ్మకంతో ఏమీ ఆలోచించకుండా భారీగా ఖర్చు పెట్టి చేసిన సినిమా ఇది. నేను లాస్ ఏంజిల్స్ వెళ్లినప్పుడు ఈ సినిమాలో అనుకున్న విషయం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అలాగే ముంబయ్ మీడియాలోనూ దీని గురించి ఎక్కువగా రాశారు. ప్రకృతే ఈ పాయింట్‌తో సినిమా చేయమని చెబుతోందని నాకు అనిపించింది. అలా ఈ సినిమా ప్రారంభమైంది.
తెలివితేటలతో మోసం చేసి…
హైదరాబాద్‌లోని ఓ బస్తీలో ఉండే అక్క, తమ్ముడు అమెరికాకు వెళ్లి అక్కడ వేల మంది కుటుంబాలను రోడ్డున పడేలా చేశారు. తెల్లవాళ్లు కదా వాళ్ల దగ్గర డబ్బులుంటాయని వాళ్లు అనుకుని, తెలివితేటలతో మోసం చేసి డబ్బు సంపాదించి అటు అమెరికన్ ప్రభుత్వానికి , ఇటు ఇండియన్ ప్రభుత్వానికి దొరక్కుండా ఎలా తప్పించుకున్నారనేదే ఈ సినిమా.
మన నేటివిటీకి తగ్గట్టుగా…
ఈ సినిమా కథ అనుకున్నప్పుడు ఆ అక్కా తమ్ముళ్లను కలుసుకోలేదు కానీ మిగతా వారిని కలుసుకున్నాను. ముందు డ్రాఫ్ట్ తయారు చేసుకున్నప్పుడు కథలోని గ్యాప్‌ను బట్టి చాలా స్వేచ్ఛ తీసుకున్నాను. అలాగే డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ వచ్చిన తర్వాత మరో డ్రాఫ్ట్ సిద్ధమైంది. మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేయడానికి డైమండ్ రత్నబాబు సహాయం తీసుకున్నాను.
అందుకే పాన్ ఇండియా మూవీగా…
ఎక్కువ బడ్జెట్ పెట్టిన మూవీ. యూనివర్సల్ కథాంశం. ఇతర భాషల్లో విడుదల చేసుకోవడానికి స్కోప్ ఉందనిపించి పాన్ ఇండియా మూవీ ‘మోసగాళ్లు’ చేశాను. ఇండియన్ వర్షన్ షూటింగ్ పూర్తయింది. ఇక ఇంగ్లీష్ వర్షన్ షూటింగ్ వారం, పది రోజులు పెండింగ్ ఉంది. కరోనా కారణంగా చేయలేకపోయాం. అక్కడి ఆర్టిస్టులు మే నెలలో డేట్స్ కేటాయించారు.
స్పోర్టివ్‌గా తీసుకొని…
ఓ స్టార్ హీరోయిన్, అందరికీ తెలిసిన హీరోయిన్‌ను నా అక్క పాత్రలో నటింప చేయాలని అనుకున్నప్పుడు ముందుగా ప్రీతి జింతాని కలిశాను. ఆవిడ కాస్త భయపడింది. తర్వాత ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఎవరు టాప్‌గా ఉంటారో ఆమెను అడుగుదామని అనుకున్నాను. అప్పుడు కాజల్ అగర్వాల్ గుర్తుకు రాగానే… ఆమెను అడిగాను. కాజల్ చాలా స్పోర్టివ్‌గా తీసుకుని ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది.
తదుపరి చిత్రాలు…
నిర్మాతగా మూడు వెబ్ సిరీస్‌లు చేయబోతున్నాను. వాటి వివరాలను ఏప్రిల్‌లో తెలియజేస్తాను. ‘ఢీ అండ్ ఢీ’ మూవీ ఇప్పటికే ప్రారంభం కావాలి. కానీ, శ్రీనువైట్ల ఇంకా కథపైనే కూర్చుని ఉన్నారు. ఎలాగైనా గట్టిగా హిట్ కొట్టాలని ఆయన బలంగా అనుకుంటున్నారు. ఏప్రిల్ ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రారంభం కావచ్చు.

Manchu Vishnu interview about Mosagallu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News