Saturday, May 4, 2024

మంధాన అరుదైన రికార్డు

- Advertisement -
- Advertisement -

Mandhana became first Indian cricketer to century in Big Bash League

 

క్వీన్స్‌లాండ్: ఉమెన్స్ బిగ్‌బాష్‌లో భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన రికార్డును నెలకొల్పింది. బిగ్‌బాస్‌లో సిడ్నీ థండర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మంధాన అజేయ శతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో బిగ్‌బాష్ లీగ్‌లో సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా మంధాన నిలిచింది. మెల్‌బోర్న్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మంధాన 114 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. చెలరేగి ఆడిన మంధాన 64 బంతుల్లోనే 114 పరుగులు చేయడం విశేషం. ఇక మెల్‌బోర్న్ తరఫున ఆడిన మరో భారత స్టార్ హర్మన్‌ప్రీత్ 55 బంతుల్లోనే 81 పరుగులు చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News