Friday, April 26, 2024

టీఆర్ఎస్ నేత హత్య కేసులో మావోయిస్టు అరెస్టు..

- Advertisement -
- Advertisement -

Maoist Arrest in TRS Leader Murder Case in Mulugu

ములుగు: అధికార పార్టీ టీఆర్ఎస్ నేత భీమేశ్వర్ రావు(48) హత్య కేసులో మావోయిస్టు లక్ష్మణ్ ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 11వ తేదీన ములుగు జిల్లాలో వెంటకటాపురం మండలం అలుబాకాలో టిఆర్ఎస్ నేత భీమేశ్వర్ రావును మావోయిస్టులు కత్తులతో పొడిచి, తుపాకితో కాల్చి చంపడంతో స్థానికంగా కలకలం రేపింది. అనంతరం మావోయిస్టులు ఘటనాస్థలంలో ఓ లేఖను వదిలి వెళ్లిపోయారు. ఈ హత్యలో ఆరగురు మావోస్టులు పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు, మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం కోదాపురం శివారులో పోలీసులను చూసి పారిపోతుండగా మావోయిస్టు లక్ష్మణ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి డిటోనేటర్లు, తూటా, వైర్లు, కర్రలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Maoist Arrest in TRS Leader Murder Case in Mulugu

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News