- Advertisement -
షార్జా: ఐపిఎల్ 13 సీజన్ లో భాగంగా జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో ప్రారంభంకానున్న ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా గత మ్యాచ్ కు దూరమైన ఢిల్లీ జట్టు స్టార్ ఆటగాడు రిషబ్ పంత్కు ఈ మ్యాచ్లోనూ విశ్రాంతినిచ్చినట్లు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. కాగా, వరుస విజయాలతో జోరుమీదున్న ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్ లోనూ గెలిచి సత్తా చాటలని భావిస్తోంది. ఇక, ఆడిన 8 మ్యాచ్ లో కేవలం మూడు విజయాలనే నమోదు చేసి పాయింట్ల పట్టికలో వెనుకంజలో ఉన్న చెన్నై ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలని చూస్తోంది.
IPL 2020: CSK Win Toss and Opt Bat against DC
- Advertisement -