- Advertisement -
కీసర: మేడ్చల్ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో సోమవారం దారుణం జరిగింది. త్రినేయని అనే వివాహిత అత్తారింట్లో ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలికి ఏడు నెలల క్రితం వివాహం జరిగింది. త్రినేయని-అక్షయ్ లు పెద్దలను కాదని ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం రాంపల్లిలో దంపతులు నివాసం ఉంటున్నారు. మొదట్లో వీరి సంసారం సాఫీగానే సాగింది. అయితే ఆమె భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని అమ్మాయి తల్లిదండ్రుల తీవ్రంగా ఆరోపిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
married woman committed suicide at medchal
- Advertisement -