- Advertisement -
అహ్మదాబాద్: ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో అహ్మదాబాద్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఒక ఎటిఎం, రెండు డజన్ల షాపులు ధ్వంసమయ్యాయి. బాపూనగర్లోని శ్యామ్షికార్ కాంప్లెక్స్లో ఈ ప్రమాదం జరిగింది. బహుళ అంతస్థుల భవనంలోని రెండు సముదాయాల్లో షాపులు, కొన్ని నివాస గృహాలు కూడా ఉన్నాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే 12 అగ్నిమాపక శకటాలను అక్కడికి తరలించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ప్రాథమిక దర్యాప్తుమేరకు ఓ టీ షాపు నుంచి మంటలు ప్రారంభమైనట్టు గుర్తించారు.
Massive Fire Broke Out in Ahmedabad
- Advertisement -