- Advertisement -
డ్యాంలో దూకేందుకు ప్రయత్నం కాపాడిన ఎల్ఎండీ పోలీసులు
తిమ్మాపూర్: ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యాప్రయత్నం చేసింది. ఎల్ఎండీ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కరీంనగర్ మండలంలోని జనగామ గ్రామానికి చెందిన ముద్రవేణి శ్రీనివాస్, అతడి భార్య సరిత, కూతురు జ్యోతి, కొడుకు వేణుతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు ఎల్ఎండీ కట్టపైకి వచ్చారు. పెట్రోలింగ్లో ఉన్న బ్లూ కోల్ట్ సిబ్బందికి విషయం తెలియడంతో వెంటనే వారిని రక్షించి స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఎస్హెచ్ఓ రష్మి పెరుమాల్ అక్కన్నపేట పోలీసులకు సమాచారం అందజేసి వారిని అప్పజెప్పారు. నలుగురు ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ కుమారస్వామి, హోంగార్డ్ శ్రీనివాస్ను ఎస్హెచ్ఓ ప్రత్యేకంగా అభినందించారు.
- Advertisement -