Saturday, April 27, 2024

మండే మంటలు

- Advertisement -
- Advertisement -

14జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు 
వడదెబ్బతో మంచిర్యాల జిల్లాలో కానిస్టేబుల్ మృతి 
నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు 
ఎండల ధాటికి బోసిపోతున్న వ్యాపారాలు.. పది జిల్లాలకు రెడ్ అలర్ట్

ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ ప్రాంతం ఉడుకెత్తిపోతోంది. వడగాలులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కూల్ కూల్‌గా ఉండే గ్రేటర్ హైదరాబాద్‌లో సైతం ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సోమవారం రాష్ట్రంలో నల్లగొండ జిల్లా దామరచర్లలో అత్యధికంగా 45.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లోనూ 45.1డిగ్రీలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఎండలు దడ పుట్టిస్తున్నాయి. వీస్తున్నాయి. లక్షెట్టిపేట అంకతివాడకు చెందిన కానిస్టేబుల్ ముత్తే సంతోష్ ఆదివారం వడదెబ్బకు గురై రాత్రి మృతి చెందాడు. ఉత్తర తెలంగాణలోని అధిక శాతం ప్రాంతాల్లో ఉదయం 11గంటలకే ఎండ తీవ్రత పెరిగిపోతోంది.

వేడిగాలులు వీస్తున్నాయి. రాత్రి ఏడు గంటల వరకూ వేడిగాలుల తీవ్రత తగ్గటం లేదు. రాష్ట్రంలోని 14జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరిగింది. ఎండలకు దడిసి జనం ఇంటికే పరిమితం అవుతున్నారు. ప్రధాన పట్టణాలు నగరాల్లో సైతం మధ్యాహ్నం సుమారు రెండు గంటల పాటు రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రాక వ్యాపారాలు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉ ద్యోగులు ఇదివరకటిలా చాయ్, సిగరెట్ కోసం చీ టికి మాటికి కార్యాలయం వదిలి బయటకు రావడం లేదు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఏసిలు, కూలర్ల ఎక్కవగా నిర్వ హణకు సమయం వెచ్చిస్తున్నారు. ఉదయం పది ఆఫీసులకు చేరుకుంటున్న సిబ్బంది సాయంత్రం 5వరకూ ఆఫీస్ వదిలి బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఉద్యోగులది ఇదే పరిస్థితి.

దిగువ స్థాయిలో గాలు లు వాయువ్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నందున రాగల మూడు రోజుల్లో పొడివవాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల మూడు రోజలు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరింత అధికంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరించింది. నుంచి హైదరాబాద్ నగరంతో పగటి ఉష్ణోగ్రతలు 41డిగ్రీలకు పెరిగే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. ఎప్పుడూ కూల్‌కూల్‌గా ఉండే గ్రేటర్‌లో సైతం సోమవారం ఎండలు దంచి కొట్టాయి. ఖైరతాబాద్‌లో 40.8డిగ్రీలు, సికింద్రాబాద్‌లో 40.7డిగ్రీలు, ముషీరాబాద్‌లో 39.9డిగ్రీలు నమోదయ్యాయి. నగరం పరిసరాల్లో కూడా ఇదే విధమైన వాతావరణం నెలకొంది. కీసరలో 40.5, శామీర్‌పేటలో 40.4, దుండిగల్‌లో 40.3, జీడిమెట్లలో 39.7 డిగ్రీలు నమోదయ్యాయి.

అత్యధికంగా దామచర్లలో 45.3డిగ్రీలు
రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లా దామచర్లలో 45.3డిగ్రీలు నమోదయ్యాయి. జయశకంర్ భూపాలపల్లిలో జిల్లా మహదేవ్‌పూర్‌లో సైతం 45.1డిగ్రీలు నమోదయ్యాయి. నల్లగొండజిల్లా నిడమనూరులో 44.9, పెద్దపల్లి జిల్లా తక్కల్ల పల్లిలో 44.5, ములుగు జిల్లా తాడ్వాయ్‌లో 44.4, రామగుండంలో 44.4, జగిత్యాల జిల్లా జైనాలో 44.3, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 44.3, కరీంనగర్ జిల్లా వీణవంకలో 44.3, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 44.2, రంగంపల్లిలో 44.2, పాల్తెంలో 44.2 డిగ్రీల ఉష్ణగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సితారామపట్నంలో 44.2, మంచిర్యాల జిల్లా జన్నారంలో 44.2, ఖమ్మం జిల్లా ఖానాపూర్‌లో 41 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర తెలగాణలోని పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల పైనే నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యల్పంగా నాగర్ కర్నూల్ జిల్లాలో నమోదయ్యాయి. అమ్రాబాద్ మండలం వటవర్లపాల్లిలో 36.2, అమ్రాబాద్‌లో 36డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన వాతావరణం నెలకొంది.

10 జిల్లాలకు రెడ్ అలర్ట్ !
రానున్న 24గంటల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కొమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ , ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలు రెడ్ అలర్ట్ జాబితాలో చేరాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News