Saturday, May 4, 2024

కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపుతాం

- Advertisement -
- Advertisement -

ప్రతి మహిళా మహాలక్ష్మిగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం
రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: కొత్త ఏడాది రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని, వారి జీవితంలో సంక్షేమం విలసిల్లాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆకాంక్షించారు. న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సందేశంలో ఆయన తెలంగాణలోని ప్రతి మహిళా మహాలక్ష్మిగా ఉండాలని, రైతన్నలకు భరోసా లభించాలని, గృహాలన్నీ జ్యోతితో వెలగాలని, ప్రతి కుటుంబానికీ సొంతింటి కల నెరవేరాలని కోరుకున్నామన్నారు.

విద్యారంగం అంతర్జాతీయ ప్రమాణాలతో వికసించాలని, ఆరోగ్య ‘ధీమా’ దక్కాలని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు చేయూత లభించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీలను అర్హుల దరిచేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. అర్హులెవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా పథకాలన్నీ వారి చెంతకే చేరేలా పారదర్శక పాలనను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరి మోములో చిరునవ్వు చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News