Saturday, May 4, 2024

మేయర్ ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్‌కు పాలాభిషేకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కార్మిక పక్షపాతి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మేడే సందర్భంగా రాష్ట్రంలోని పారిశుద్ధ్య కార్మికులకు వేతనం పెంచడం సహోసపేత నిర్ణయమని మేయర్ గద్వాల్ విజయలక్ష్మికొనియాడారు. సిఎం కెసిఆర్ పారిశుద్ద కార్మికుల వేతనాలు రూ.1000లు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం మేయర్ తన క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి సిఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ కార్మికులకు నెలనెలా అందుతున్న జీతానికి అదనంగా మరో రూ.1000లను పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

దేశంలోని ఏ రాష్ట్రంలో పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచలేదని, కార్మికుల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే పెంచారన్నారు. జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న కార్మికులు చేస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఇతర శాఖలైన మెట్రో, వాటర్ వర్క్స్ తో పాటుగా మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో పని చేస్తున్న మొత్తం 1,06,474 మందికి లబ్ధి చేకూరేలా ఆర్థిక శాఖ జీవో నెంబర్ 39, 40 లను విడుదల చేసిందన్నారు. రాష్టానికి ఆర్థిక భారమైనా వెనుకాడకుండా కార్మికులకు మెరుగైన జీవనానికి గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మేయర్ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News