Friday, April 26, 2024

ఇవి అచ్చేదిన్ కాదు.. సామాన్యుడు సచ్చేదిన్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు 12శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్యగా అభివర్ణించారు. జ్వరం, ఇన్ఫెక్షన్స్, బీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మందులతో పాటు పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి 800 పైగా నిత్యావసర మందుల ధరలు పెంచితే, అది పేద, మధ్య తరగతి ప్రజలకి భారం అవుతుందన్నారు.

సామాన్యుడిని ఇబ్బంది పెట్టడమే బిజెపి ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. అవకాశం దొరికిన ప్రతిసారీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, చివరకు జబ్బు చేస్తే ప్రాణాలు కాపాడే మందుల ధరలు కూడా పెంచేందుకు సిద్దమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అత్యంత బాధాకరం. దుర్మార్గమైన చర్య అన్నారు. ఇదేనా బిజెపి చెబుతున్న అమృత్ కాల్..?? ఇవి అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సచ్చే దిన్.. అని మంత్రి పేర్కొన్నారు. దేశంలో బిజెపి పాలనకు రోజులు దగ్గర పడ్డాయని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News