హైదరాబాద్: వ్యవసాయ క్షేత్రంలో నేరుగా విత్తనాలు చల్లి సాగుచేసే వరివేద సాగుపద్దతిలో ఆదర్శరైతుగా నిలిచిన లక్ష్మీతిరుపతి మహిళా రైతును రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ట్విట్టర్ వేదికగా అభినందించారు. కూలీలు లేకుండా నేరుగా వ్యవసాయక్షేత్రంలో విత్తనాలు చల్లి సాగుచేస్తూ అధికదిగుబడి సాధిస్తున్న ఈ మహిళారైతు ఆదర్శంగా నిలిచారని మంత్రి హరీశ్రావు ప్రశంసించారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరులోని కొండపల్కం గ్రామంలో మహిళారైతు అద్భుతాలను సృష్టిందరని, సాగు ఖర్చు తగ్గించి అధిక రాబడి సాధించారని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
వరి వెద సాగు ( నేరుగా విత్తనాలు వెదజల్లి వరి సాగు చేసే ) పద్దతి లో వ్యవసాయం చేస్తూ ఎందరో రైతులకు స్పూర్తి గా నిలుస్తున్న ఆదర్శ రైతు దంపతులు లక్ష్మీ , తిరుపతి రెడ్డి లకు అభినందనలు pic.twitter.com/3yzGXaz8Dy
— Harish Rao Thanneeru (@trsharish) December 20, 2020