- Advertisement -
సంగారెడ్డి: జహీరాబాద్ చెరుకు రైతుల సమస్యను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పరిష్కరించారు. జహీరాబాద్ చెరుకు రైతులతో ట్రైడెంట్ షుగర్ పరిశ్రమ అగ్రిమెంట్ చేయించారు. చెరుకును సంగారెడ్డి గణపితి షుగర్స్ కు తరలించాలని రైతులక మంత్రి హరీశ్ తెలిపారు. చెరుకు రైతులు నష్టపోకుండా చూడాలని అధికారులను మంత్రి హరీశ్ ఆదేశించారు. సంగారెడ్డి రైతులకు చెల్లించే ధరనే జహీరాబాద్ ప్రాంత రైతులకు వర్తింపజేయాలని సూచించారు. ట్రైడెంట్ పరిశ్రమ చెరుకు రైతు బకాయిలు చెల్లించాలని ఆయన ఆదేశించారు. బకాయిలు చెల్లించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు రావాల్సిన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్ హామీ ఇచ్చారు.
- Advertisement -