Friday, May 3, 2024

తిరుమల శ్రీవారి సన్నిధిలో మంత్రి కొప్పుల ఈశ్వర్..

- Advertisement -
- Advertisement -

తిరుమల: తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం సతీసమేతంగా కొప్పుల ఈశ్వర్ విఐపి దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ తోపాటు కోరుట్ల ఎమ్మెల్యే, టిటిడి పాలకమండలి సభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

Minister Koppula Eshwar Couple visit Tirumala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News