Friday, April 26, 2024

పేద గిరిజన వైద్య విద్యార్థి మెడిసిన్ చదువుకు కెటిఆర్ సాయం

- Advertisement -
- Advertisement -
Minister KTR lends helping hand to tribal girl 
కరోనా పరిస్థితుల్లో తల్లితో కలిసి కూరగాయలు అమ్ముతున్న అనూష
 కిర్గిజిస్తాన్‌లో ఎంబిబిఎస్ కోర్సు,  తొలి 3 ఏళ్లలో 95%పైగా మార్కులు
 పరిస్థితి తెలుసుకుని వైద్యవిద్యకు సాయం అందించిన మంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ నగరం బోరబండ ప్రాంతానికి చెందిన తిరుపతి అ నూష కిర్గిజిస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబిబి ఎస్ చదువుతుంది. అయితే కరోనా పరిస్థితుల నే పథ్యంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్ర స్తుతం తాను చదువుతున్న వైద్య విద్య కోర్సులో మొదటి మూడేళ్లల్లో 95శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అయితే కరోనా నేపథ్యంలో చదువును కొనసాగించే పరిస్థితులు లేకపోవడం తో తన తల్లితో కలిసి కూరగాయలు అమ్మడం ప్రా రంభించింది. పేద గిరిజన కుటుంబానికి చెందిన అనూష తండ్రి వాచ్‌నెన్‌గా పని చేస్తున్నారు. ఆమె తన వైద్యవిద్య కోర్సు ఫీజుల కోసం ఇబ్బందులు పడుతున్న విషయం మంత్రి దృష్టికి వచ్చింది.

పేదరిక పరిస్థితుల నేపథ్యంలోనూ ఎంతో ఛాలెంజ్ గా తీసుకుని వైద్యవిద్యపై మక్కువతో విదేశాలకు వెళ్లి చదువుకునే ప్రయత్నం చేస్తున్న అనూషకు అండగా నిలిచేందుకు కెటిఆర్ నిర్ణయం తీసుకొ న్నారు. ఈ నేపథంలో ఆమెను ప్రగతి భవన్ కు పిలుపించుకుని ఆమె వైద్య విద్యను కొనసాగిం చేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేశారు. అనూష ఎంబిబిఎస్ ఫీజుల బాధ్యత తీసుకుంటా నని తెలిపిన ఆయన కోర్సు పూర్తి చేసుకొని డాక్ట ర్‌గా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ సంద ర్భంగా అనూషకు ది బెస్ట్ చెప్పారు. అలాగే భవిషయత్తులోనూ అన్ని విధాలుగా అండ గా ఉంటానని భరోసా ఇచ్చారు. అనూష వైద్య విద్యకు అండగా నిలిచిన మంత్రి కెటిఆర్‌కు ఆమె కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News