- Advertisement -
హైదరాబాద్: నిరుద్యోగులకు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రేపోమాపో ముఖ్యమంత్రి కెసిఆర్ నిరుద్యోగ భృతి ప్రకటిస్తారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే లక్ష 31వేల ఉద్యోగాలు ఇచ్చామన్న ఆయన మరో 50 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నామని తెలిపారు. నిన్న మొన్న వచ్చిన నేతలు కూడా సిఎం కెసిఆర్ ను విమర్శిస్తున్నారని మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. ”కెసిఆర్ లేకుంటే మీకు ఆ పదవులు ఎక్కడివి?.. టిఆర్ఎస్ లేకుంటే టిపిసిసి, టిబిజెపిలు ఉండేవా”? అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. ఆ పదవులు బిక్ష పెట్టింది కెసిఆర్ అనేది మర్చిపోవద్దని కెటిఆర్ స్పష్టం చేశారు. తమ సహనానికి కూడా హద్దు ఉంటుందని కెటిఆర్ హెచ్చరించారు. కొంతమంది ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా మాట్లాడితే తిప్పికొట్టాలని నేతలకు సూచించారు.
- Advertisement -