Wednesday, May 29, 2024

వైసిపి ఎంఎల్ఎ అంబటి రాంబాబుకు కరోనా..

- Advertisement -
- Advertisement -
MLA Ambati Rambabu test positive for Corona
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మహమ్మారి కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో సాదారణ ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. బుధవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైసిపి ఎంఎల్ఎ అంబటి రాంబాబుకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన వీడియో ద్వారా తెలిపారు. కొద్దిరోజులుగా అనారోగ్యంగా ఉండడంతో ఆస్పత్రికి వెళ్లి కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చిందని అంబటి రాంబాబు చెప్పారు. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం వైసిపి ఎంపి విజయసాయిరెడ్డికి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.

కాగా, గడిచిన 24 గంటల్లో ఎపిలో కొత్తగా 6,045 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 64,713కు చేరుకుంది. కరోనాతో ఇవాళ ఒక్కరోజే 65మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌తో మరణించినవారి సంఖ్య 823కి చేరింది.

MLA Ambati Rambabu test positive for Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News