- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీసు శాఖను ఆదేశించారు. దీనికోసం అవసరమైన జాబితాను రూపొందించాలని కోరారు. ప్రగతి భవన్లో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జైళ్ళ శాఖ డిజి రాజీవ్ త్రివేది, డిజిపి మహేందర్ రెడ్డి తదితరులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఖైదీల విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను పరిశీలించారు.
CM KCR orders to release well behaved prisoners
- Advertisement -