- Advertisement -
అమరాతిః ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఎపిలో కొత్తగా 6045 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. కరోనాతో ఇవాళ ఒక్కరోజే 65మంది మృతి చెందారని తెలిపింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 64,713కు చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్తో మరణించినవారి సంఖ్య 823కి చేరింది. ప్రస్తుతం ఎపిలోని వివిధ ఆస్పత్రుల్లో 31,763మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 32,127మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ఎపిలో 49,553మందికి కరోనా పరీక్షలు చేశామని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 14 లక్షల 35 వేలకు పైగా కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది.
6045 New Corona Cases Reported in AP
- Advertisement -