Sunday, April 28, 2024

జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలకు మరిన్ని నిధులు, విధులు ఇవ్వండి!

- Advertisement -
- Advertisement -
MLC Kavitha Meets Minister Errabelli on Local Bodies Issues
కవిత ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లిని కలిసి విజ్ఞప్తి చేసిన స్థానిక సంస్థల ఎంఎల్‌సిలు

హైదరాబాద్ : జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలకు మరిన్ని అధికారాలు, నిధులు కల్పించాలని రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కోరారు. ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఆధ్వరంలో పలువురు స్థానిక సంస్థల ఎంఎల్‌సిలు మంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. బుధవారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి నివాస ప్రాంగణంలో కలిసి ఒక వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని వారు కోరారు. స్థానిక పరిపాలనలో ఎంఎల్‌సిలు, జెడ్‌పిటిసిలు, ఎంపిటిసీలకు మరింత భాగస్వామ్యం కల్పించాలని మంత్రికి అందజేసిన వినతిపత్రలో కోరారు. ప్రధానంగా మరిన్ని నిధులు, విధులు వంటి అంశాలపై మంత్రి ఎర్రబెల్లితో వారు చర్చించారు. వీటికి సంబంధించి సుమారు 16 అంశాలను మంత్రి ఎర్రబెల్లితో చర్చించామని ఎంఎల్‌సి భానుప్రసాద్ తెలిపారు. వీటిపై వెంటనే సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని వారికి ఈ సందర్భంగా మంత్రి హామి ఇచ్చారు.

అంతేకాకుండా త్వరలో స్థానిక సంస్థల ఎంఎల్‌సిలంతా ఈ అంశాలపై సిఎం కెసిఆర్‌ను కూడా కలుస్తామన్నారు. అంతేకాకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్‌ను కలిసి పార్టీ పరంగా మద్దతు కోరతామని భానుప్రసాద్ తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంలో సిఎం కెసిఆర్ నాయకత్వంలో పల్లెల రూపురేఖలు మారిపోయాయన్న ఎంఎల్‌సిలు గ్రామాలు అన్ని రంగాల్లో ఎంతో పురోగతిని సాధించాయన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుభీమా , కల్యాణలక్ష్మి, షాదిముబారక్, ఆసరా పెన్షన్లు తదితర కార్యక్రమాల వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలోపేతం అయిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎంఎల్‌సిలు కవితతో పాటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వి. భూపాల్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, పట్నం మహేందర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచకుల్ల దామోదర్ రెడ్డి, తేరా చిన్నప రెడ్డి, పురాణం సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News