Wednesday, May 15, 2024

బ్రిస్‌బేన్ బోనాల పోస్టర్‌ను ఆవిష్కరించిన కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్ నగరంలో జరిగే బోనాలకు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఆవిష్కరించారు. భారత జాగృతి ఆధ్వర్యంలో జూలై 15వ తేదీన ఉదయం 10.00 గంటలకు బ్రిస్ బేన్‌లోని గాయత్రి మందిర్‌లో ఈ కార్యక్రమం జరుగనుండగా, ఈ సందర్భంగా కవిత బ్రిస్‌బెన్‌లోని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బ్రిస్‌బేన్ తెలంగాణ అసోసియేషన్,

క్వీన్స్ ల్యాండ్ తెలుగు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ అఫ్ గోల్ కోస్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియాలు మద్దతు పలికాయి. శనివారం జరిగిన ఈ పోస్టర్ ఆవిష్కరణలో తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, భారత జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, యువజన విభాగం అధ్యక్షుడు కోరబోయిన విజయ్, సాంస్కృతిక విభాగం కన్వీనర్ కోదారి శ్రీను, లీగల్ సెల్ కన్వీనర్ తిరుపతి వర్మ, రాష్ట్ర కార్యదర్శి విక్రాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News