Thursday, May 9, 2024

దేశ భక్తి గీతంతో మోడీని సమ్మోహన పర్చిన భారత సంతతి బాలుడు

- Advertisement -
- Advertisement -

బెర్లిన్ : మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ తొలుత జర్మనీలో కాలుపెట్టగానే ఆయనకు ఇండియన్ కమ్యూనిటీ నుంచి సాదర స్వాగతం లభించింది. బెర్లిన్ బ్రాండెన్ బర్గ్ విమానాశ్రయానికి సోమవారం ఉదయం మోడీ చేరుకున్నారు. ఈ సందర్భంగా భారత సంతతి ప్రజలతో ఆయన కొద్దిసేపు ఉల్లాసంగా గడిపారు. వందేమాతరం , భారత్ మాతాకీ జై నినాదాలు హోరెత్తాయి.తమ తల్లిదండ్రులతో పాటు వచ్చిన చిన్నారులను మోడీ ఆప్యాయంగా పలకరించారు. మోడీ చిత్తరువును ఒక చిన్నారి ఆయనకు బహూకరించగా, చిత్రలేఖనానికి ఎంత సమయం పట్టిందని మోడీ అడిగి తెలుసుకున్నారు.

అనంతరం బాలికతో ఫోటో దిగారు. ఆ చిత్తరువుపై మోడీ సంతకం చేసి తిరిగి ఆమెకు అందజేశారు. అనంతరం భారత సంతతి బాలుడొకరు దేశభక్తి గీతంతో మోడీకి అభివాదాలు తెలియజేశారు. ఆ గీతం పాడుతున్నంత సేపు మోడీ ఆసక్తిగా వింటూ పాటకు తగినట్టుగా చిటెకెలు వేస్తూ , గీతాలాపన పూర్తి కాగానే బాలుడి బుగ్గలు నిమిరి ఆప్యాయంగా తలను తడిమారు. పలువురు చేతులు ఊపుతూ మోడీకి అభివాదాలు తెలియజేయగా, మరికొందరు మోడీ పాదాలకు నమస్కరిస్తూ ఆయన వల్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News