Friday, May 3, 2024

ఫోకస్ హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

kcr

 

గ్రేటర్ పరిధిలోనే కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి, వైరస్ కట్టడికి వ్యూహం
17 యూనిట్లుగా రాజధాని నగరం విభజన
ప్రతి యూనిట్‌కు ప్రత్యేక వైద్య, పోలీసు, మున్సిపల్, రెవిన్యూ అధికారుల నియామకం
మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రుల నేతృత్వంలో ప్రతిరోజూ సర్కిళ్ల వారీగా సమీక్ష
రోజుకు 1000 నుంచి 1100 మందికి పరీక్షలు
ఎన్ని కేసులొచ్చినా వైద్యానికి సిద్ధంగా ఉండాలి
కంటైన్‌మెంట్ ఏరియాలలో కఠిన నిబంధనలు
ఉన్నతస్థాయి సమీక్షలో సిఎం కెసిఆర్ ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారిలో జిహెచ్‌ఎంసి పరిధిలోని వారే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నందున హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరాన్ని జోన్ల వారీగా విభజించి, ఒక్కో జోన్ ను ఒక్కో యూనిట్ గా పరిగణించి, ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్మెంట్లను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. దేశంలో, రాష్ట్రంలో, సరిహద్దు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యశాఖ అన్ని విధాలా సర్వసన్నద్ధంగా ఉండాలని కోరారు.కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటన్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. సోమవారం కొత్తగా 61 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఒకరు మరణించారని అధికారులు సిఎంకు వెల్లడించారు. పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో అన్ని లేబొరేటరీలను, ఆసుపత్రులను సిద్ధం చేశామని చెప్పారు. ఒక్క రోజు వెయ్యి నుంచి 11 వందల మందికి పరీక్షలు నిర్వహించే విధంగా, ఎన్ని కేసులొచ్చి నా వైద్యం అందించే విధంగా వ్యవస్థను సిద్ధం చేసినట్లు వివరించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు, ఇతర జిల్లాల్లో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ప్రయత్నాలను, లాక్ డౌన్ అమలును, ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాల ను సిఎం సమీక్షించారు. కొందరు జిల్లా అధికారులతో నేరుగా మాట్లాడి పలు సూచనలు చేశా రు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసు లు నమోదవుతున్నాయన్నారు. పాజిటివ్ వచ్చిన వారిద్వారా ఇతరులకు తొందరగా వ్యాప్తి అయ్యే అవకాశాలు కూడా హైదరాబాద్‌లో ఎక్కువ ఉన్నాయన్నారు.

కాబట్టి హైదరాబాద్ విషయం లో ప్రత్యేక వ్యూహం అనుసరించాలని సూచించారు. నగరంలోని మొత్తం 17 సర్కిళ్లను 17 యూనిట్లుగా విభజించి, ప్రతీ యూనిట్‌కు ప్రత్యేకంగా వైద్యాధికారిని, పోలీసుఅధికారిని, మున్సిపల్ అధికారిని, రెవెన్యూ అధికారిని నియమించాని ఆదేశించారు. మున్సిపల్ యంత్రాంగమం తా కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో నిమగ్నం కావాలన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికంతా ఒకే డిఎంహెచ్‌ఒ ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో 17 సర్కిళ్లకు వేర్వేరుగా సీనియర్ వైద్యాధికారిని నియమించాలని సిఎం ఆదేశించారు. పాజిటివ్ కేసుల ఆధారంగా రాష్ట్రం మొత్తం 246 కంటైన్మెంటులు ఏర్పాటు చేశామన్నారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 126 కంటైన్మెంటులున్నాయని, వీటిని మరింత పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

ప్రజలను బయటకు రానీయవద్దు
కంటైన్మెంట్లలోని ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానీయవద్దు అని సిఎం కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే బయట వారిని లోపటికి పోనీయవద్దు అని పేర్కొన్నారు. ప్రతి కంటైన్మెంటుకు ప్రత్యేక పోలీసు అధికారిని, నోడల్ అధికారిని నియమించాలని సూచించార. వారి ఆధ్వర్యలో అత్యంత కఠినంగా నియంత్రణ చేయాలన్నారు. ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులను ప్రభుత్వ యంత్రాంగమే అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. అత్యధిక జనసమ్మర్థం ఉండే జిహెచ్‌ఎంసిలో పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండడాన్ని అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించాలని ముఖ్యమంత్రి అన్నా రు. మున్సిపల్ శాఖ మంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి,ఇతర సీనియర్ అధికారులు ప్రతీ రోజు ఉదయం ప్రగతి భవన్ లోనే జిహెచ్‌ఎంసిలోని సర్కిళ్ల వారీగా ప్రత్యేక సమీక్ష జరపాలని, పరిస్థితికి తగ్గట్టు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఇండ్ల నుంచి బయటకు రావద్దని ముఖ్యమంత్రి మరోసారి విజ్ఞప్తి చేశారు.

 

Most of corona cases are within Greater Range
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News