Saturday, May 4, 2024

తనయుడు పండుగకు రాలేదని తల్లి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Mother commit suicide over son

హైదరాబాద్: తనయుడు దీపావళి పండుగకు రాలేదని తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బుచ్చిబాబు(60), సుజాత(55) అనే దంపతులు మోడల్ కాలనీలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. అతడికి గత మూడు నెలల క్రితం వివాహం జరిపించారు. కోడలు, కొడుకు విశాఖపట్నంలో సాఫ్ట్‌వేర్ జాబ్‌లు చేస్తూ అక్కడే ఉంటున్నారు. దీపావళి పండుగకు రావాలని కుమారుడిని తల్లి కోరింది. సెలవులు లేకపోవడంతో రాలేనని తల్లికి కుమారుడు చెప్పాడు. పండుగకు కుమారుడు రాలేదని పలుమార్లు బాధను భర్తతో భార్య చెప్పుకుంది. గురువారం తెల్లవారుజామున భర్త పెంట్‌హౌస్‌లో నిద్రిస్తుండగా సుజాత కింది ఫ్లోర్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News